Boppudi

పూర్వం మన గ్రామమైన బొబ్బిలిదేవపురాన్ని(నేటి బొప్పూడి) రాజథానిగా చేసుకొని చొళులు పరిపాలించేవారు. దీనికి కారణం దట్టమైన అడవి మరియు ఎత్తైన కొండ ఉండటంచేత శత్రువులబారి నుండి తప్పించుకొవడానికి మంచి అనువైన ప్రదేశంగా బావించి ఉండవచ్చు.ఈ క్రమంలొ వారు కొండమీద అనువైన ప్రదేశం కొసం వెతుకుతున్నపుడు స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ వేంకటేశ్వర స్వామివారు దర్శనం ఇచ్చినట్లు ప్రతీతి.ఈ విషయాలన్ని చెన్నైలొ ఉన్నటువంటి బ్రౌన్ రాసిన లొకల్ రికార్డ్స్ వ్యాల్యూం 50 లొ 641 నుండి 643 పేజీల వరకు మన ఊరి(బొప్పూడి) చరిత్రను ప్రస్తావించారు. చొళరాజుల పరిపాలన అనంతరం 1700 లొ బొబ్బిలిదేవపురంపై ఔరంగజేబు దండయాత్ర చేసాడు.గ్రామానికి చెందిన భూములను వేలం వేసి ఆలయాలను నిర్లక్ష్యం చేశారు.శ్రీ క్రిష్ణదేవరాయలు మంత్రి అయినటువంటి మాహమంత్రి తిమ్మరుసు అన్న కుమారుడు బొప్పన్న కొండపైన వెలసిన వెంకటేశ్వరస్వామి మరియు గ్రామంలొని చెన్నకేశవస్వామి వార్లకు ఆలయాలను నిర్మించారు.

అనంతరం వారి వారసుడు రాజయ్య దేవాలయాలకు 78 ఎకరాలు భూమిని విరాళంగా అందించారు. ఔరంగజేబు వేసిన వేలంలొ పొలాన్ని కోల్పొయిన వారికి ఉచితంగా భూమిని పంపిణి చేసారు.నాటినుండి బొప్పయ్యకు కృతజ్ఞతగా గ్రామం పేరు బొప్పూడిగా తీర్మానించారు. ఈ క్రమంలొ ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ విషయం ఎమనగా బొప్పూడి కొండనుండి కొండవీటికొండకు రహస్యమార్గం ఉందని ఊరిలొని కొందరు పెద్దలు చెప్తున్నారు. గ్రామంలొని చెన్నకెశవస్వామి వారి ఆలయంలొ దూపదీప నైవేద్యాలు అందించేందుకు సూదనపాడు గ్రామంలొ 11 పుట్లు భూమిని అందిస్తూ 1156 నవంబరు 15 తేదీన నన్నెచోళుడు శిలాశాసనాన్ని ఏర్పాటు చేశారు.
ఈ శాసనం నేడు ఆ ఆలయంలోనె మనం చూడవచ్చు.

నాటి కోనయ్య కుంటే … నేటి మారుతీ నగర్

ఒకప్పుడు ట్రంకు రోడ్డు గా పిలుచుకునే 16వ నెంబర్ జాతీయ రహదారిపై దేవాలయ ప్రాంతంలో నిత్యం రోడ్డు  ప్రమాదాలు జరిగేవి. ఈ ప్రాంతంలో పొలం పనులు నిర్వహించుకొనే రైతులకు వీలుగా కోనయ్య కుంట పేరుతో పెద్ద చెరువు ఉండేది. ఒంగోలు వైపు వెళ్లే మార్గంలో ప్రమాదం జరిగిందంటే ఒక్క కోనయ్యకుంట సమీపంలో జరిగేవి.

ఆ సమయంలో బొప్పూడి సమీప ప్రాంతాలకు చెందిన ప్రజలు సమిష్టిగా 1983లో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహాన్ని తక్కెళ్లపాడు అయ్యంగార్లు.  అయిన శ్రీ శైలనాధన్ పర్యవేక్షణలో ప్రతిష్టించారు

అప్పటి నుంచి ఈ ప్రాంతంలో రోడ్డు  ప్రమాదాలు లేకుండా నిలిచాయి. జాతీయ రహదారిపై వెళ్లే వారు విధిగా ఆలయం వద్ద ఒక్క క్షణం వాహనాన్ని ఆపి స్వామివారికి నమస్కరించి వెళతారు. ఆలయం నిర్మించిన నాటి నుంచి ప్రమాదాల సంఖ్య తగ్గి భక్తుల సంఖ్య పెరుగుతూ ఆలయం పురోభివృద్ధి చెందింది.

నాటి నుంచి ఈ ప్రాంతాన్ని మారుతీ నగర్ అని పిలుస్తారు.